ఢిల్లీ లిక్కర్ స్కాం లో కేసులో మరో ట్విస్ట్‌..వెలుగులోకి షాకింగ్‌ నిజాలు

-

ఢిల్లీ లిక్కర్ స్కాం లో కేసులో మరో ట్విస్ట్‌ చోటు చేసుకుంది. హైదరాబాద్ కేంద్రంగా ఢిల్లీ లిక్కర్ స్కాం విచారణ కొనసాగుతోంది. కేసుముడుపుల విషయంలో లోతుగా దర్యాప్తు చేస్తున్న ఈడి… లిక్కర్ స్కాం కేసులో ఉన్న కంపెనీలకు హైదరాబాద్ కంపెనీల నుండి భారీగా ముడుపులు ముట్టినట్లు గుర్తించింది. శ్రీనివాసరావుకు చెందిన పలు కంపెనీల నుండే ముడుపులు వెళ్లినట్టు ఆధారాలు సంపాదించారు.

లిక్కర్ స్కామ్ కేసులో అనూహ్యంగా తెరమీదకి వచ్చిన శ్రీనివాసరావు పేరు.. సిఎ బుచ్చిబాబు ఇంట్లో సోదాల అనంతరమే శ్రీనివాసరావు పై ఫోకస్ పెట్టింది ఈడి. దోమలగూడ లోని బుచ్చిబాబు నివాసంలో సుదీర్ఘంగా హోదాలు చేసిన ఈడీ.. బుచ్చిబాబు ఇంట్లో లభించిన హార్డ్ డిస్క్లో కీలక సమాచారం రాబట్టింది.

శ్రీనివాసరావు ద్వారానే కోట్లాది రూపాయల లావాదేవీలు జరిగినట్టు ఆధారాలు సంపాదించింది ఈడీ. కంపెనీల ఏర్పాటుకు సంబంధించి డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్న ఈడి.. పలు ఒప్పంద పత్రాలను క్షుణంగా పరిశీలిస్తున్నది. పిళ్ళై, శ్రీనివాసరావు మధ్య జరిగిన సంభాషణలను రిట్రై వ్ చేసిన ఈ డి.. సిగ్నల్ యాప్ ద్వారా ఇరువురి మధ్య సంభాషణలు వింటోంది. శ్రీనివాసరావు, పిల్లై ల నుండి కీలక సమాచారం సేకరించింది. దీనిపై మరింత లోతుగా విచారణ చేయాలని అనుకుంటోంది.

Read more RELATED
Recommended to you

Latest news