ఇక నుంచి సీఎం కేసీఆర్ ను తిట్టను – ధర్మపురి అరవింద్

-

నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన ప్రకటన చేశారు. ఇకపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ను తాను తిట్టబోనని వెల్లడించారు. కెసిఆర్ అంటే తనకు వ్యక్తిగతంగా ఎలాంటి ద్వేషం లేదని.. రాజకీయంగా మాత్రమే చేస్తున్నానని పేర్కొన్నారు అరవింద్.

ఇవి తాను ఆవేదనతో చెబుతున్న మాటలని… ఇకపై సీఎం కేసీఆర్ గురించి అసభ్యంగా మాట్లాడబోనని స్పష్టం చేశారు. తెలంగాణలో తాజా పరిణామాలతో బీజేపీకి ప్రజాదరణ పెరగడం అలాగే అదే సమయంలో టిఆర్ఎస్ గ్రాఫ్ పడిపోవడంతోనే సీఎం కేసీఆర్ మానసిక స్థితి రోజురోజుకు దిగజారుతోందని ఆయన ఏద్దేవా చేశారు.

” తెలంగాణాలో భారీ వర్షాలపై సీఎం కెసిఆర్ గారి ‘విదేశీ కుట్ర’ వ్యాఖ్య అనంతరం చాలా బాధనిపించింది, జాలి కూడా కలిగింది..ఆయన మమ్మల్ని ఏ విధంగా బాధించినా, ఇకనుండి వారిపై పరుష పదజాలం ఉపయోగించకుండా ఉండడానికి పూర్తి ప్రయత్నం చేస్తాను!” అంటూ ఓ వీడియో విడుదల చేశారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్.

Read more RELATED
Recommended to you

Latest news