బుట్టాచోర్ మాటలు ఇక నమ్మొద్దు : ఎమ్మెల్యే రామారావు పటేల్

-

తెలంగాణలో మే13న లోక్ సభ ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. ఎన్నికల్లో పోటీ చేసేందుకు అన్ని పార్టీలకు చెందిన అభ్యర్థులను ఇప్పటికే ప్రకటిస్తున్నారు. ఇదిలా ఉంటే..  కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు చెప్పే బుట్ట చోర్ మాటలు ఇక ప్రజలు నమ్మొద్దని ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ అన్నారు. బీజేపీ ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి గోదం నగేష్ పట్టణంలోని ఎస్ఎస్ జిన్నింగ్ ఫ్యాక్టరీ కార్యాలయంలో కార్యకర్తలతో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో తాము అధికారంలో ఉన్నామని, స్థానిక కాంగ్రెస్ నాయకులు విర్రవీగుతున్నారని, ఎన్ని చేసినా అభివృద్ధిని అడ్డుకోలేరని ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ అన్నారు.

ఎమ్మెల్యే అభ్యర్ధిగా ఎన్నికైన 100 రోజుల్లోనే తాలుకాకి రూ. 140 కోట్లతో అభివృద్ధి పనులు తెచ్చిన ఘనత తమది అన్నారు. కేంద్ర అధికారంలో తామున్నామని, మళ్లీ వచ్చేది తమ ప్రభుత్వమేనని రాష్ట్రంలో పాలన సాగాలంటే కేంద్రం పై ఆధారపడాల్సిందేనన్నారు. ప్రజా ఆశీర్వాదంతో గెలిచానని, ప్రజల కోసమే పని చేస్తానని, అధికారం కోల్పోయిన వారు ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news