దిల్లీ లిక్కర్ స్కామ్​లో ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు

-

దిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. వరుస అరెస్టులు చేస్తూ ఈ స్కామ్​లో కూపీ లాగుతోంది. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) నోటీసులు జారీ చేసింది. రేపు(గురువారం) విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది.

హైదరాబాద్‌ వ్యాపారి అరుణ్‌ రామచంద్ర పిళ్లైతో కలిపి కవితను ప్రశ్నించనున్నట్లు సమాచారం. ఈ కేసులో రామచంద్ర పిళ్లై.. కవితకు బినామీ అని ఈడీ మంగళవారం సీబీఐ ప్రత్యేక న్యాయస్థానానికి తెలిపిన విషయం తెలిసిందే.

ఆప్‌ నేతలకు రూ.100 కోట్ల ముడుపులు ముట్టజెప్పిన సౌత్‌గ్రూప్‌ గుప్పిట్లో ఉన్న ఇండోస్పిరిట్స్‌ సంస్థలో ఎమ్మెల్సీ కవిత తరఫున అరుణ్‌ భాగస్వామిగా ఉన్నారని పేర్కొంది. ఈ మొత్తం వ్యవహారంలో నేరపూరిత ఆర్జన రూ.296 కోట్లు ఉండవచ్చని ఆరోపించింది. ఇందులో కొంత మొత్తాన్ని అరుణ్‌పిళ్లై స్థిర, చరాస్తుల కొనుగోలుకు ఉపయోగించినట్లు పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news