ఎల్లుండి బీఆర్ఎస్ కీలక సమావేశం

-

తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఏప్రిల్ 18న తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ కీలక సమావేశం జరుగనుంది. ఎంపీ అభ్యర్థులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, జెడ్పీ చైర్మన్లు, కార్యవర్గ సభ్యులకు ఆహ్వానం అందింది. ఎంపీ అభ్యర్థులకు బీ-ఫారాలను, ఎన్నికల ఖర్చు కోసం రూ.95 లక్షల చొప్పున చెక్కులను కేసీఆర్ అందజేస్తారు.

రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర, ఎన్నికల ప్రచారం వంటి వ్యూహాలపై చర్చిస్తారు. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయిన విషయం తెలిసిందే. పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోకుండా జాగ్రత్త పడేందుకు వ్యూహాలను రచిస్తున్నారు. ఎలాగైనా 10 నుంచి 12 ఎంపీ స్థానాలను కైవసం చేసుకోవాలని బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తోంది. మరీ  మే 13న జరిగే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఏయే పార్టీ ఎన్ని సీట్లను సాధిస్తుందో తెలియాలంటే జూన్ 04 వరకు వేచి చూడాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news