త్వరలో ఊహకు అందనంతగా బీజేపీలో చేరికలుంటాయి – ఈటల

-

త్వరలో ఊహకు అందనంతగా బీజేపీ లో చేరికలుంటాయని ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్ని పార్టీల ఏం ఎల్ ఏ లు మాతో టచ్ లో ఉన్నారని…బీజేపీ అధికారం లో రావడానికి హై కమాండర్ నాకు బాధ్యత అప్పాజెప్పిందని చెప్పారు ఈటల. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ క్యాంపు ఆఫీస్ లో ఈటల రాజేందర్ ప్రెస్ మీట్ నిర్వహించారు.

ఈ సందర్భంగా బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాట్లాడుతూ…రెసిడెన్సీ స్కూల్స్ మొత్తం అద్మణంగా తయారయ్యాయని…ప్రతి రోజు ఎక్కడో దగ్గర విద్యార్థులకు అశ్వస్థతలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ పార్టీని బ్రహ్మ దేవుడు కూడా కాపాడ లేడని సంచలన వ్యాఖ్యలు చేశారు బిజేపి పార్టీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. నెక్స్ట్ టార్గెట్ కెసిఆర్ కెసిఆర్ ని ఓడగొట్టడమే నా జీవిత లక్ష్యమన్నారు. ఉప ఎన్నికలో హుజురాబాద్ లో ఈటల గెలువాలని రాజగోపాల్ రెడ్డి చెప్పాడని వెల్లడించారు. హుజురాబాద్ ప్రజల కాలికి ముళ్ళు గుచ్చితే నోటితో పీకే వ్యక్తి ఈటల అని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news