బీజేపీ కోసం సైనికుడిలా పనిచేస్తా : ఈటల

-

హుజురాబాద్‌ MLA ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. BJP శ్రేణులను ఉద్దేశించి MLA ఈటల రాజేందర్ భావోద్వేగంగా ట్వీట్ చేశారు. ’40 ఏళ్లుగా గెలవాలని కార్యకర్తలు, నాయకులు ఎదురుచూస్తున్నారు. అనేక కష్టాలు పడ్డారు. అవమానాలు భరించారన్నారు హుజురాబాద్‌ MLA ఈటల రాజేందర్.

etala
etala

త్యాగాలు చేశారు. పదవులు లేకున్నా కాషాయ జెండా పట్టి కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు. ఇవాళ ప్రజల ఆశీర్వాదం దొరికే సమయం ఆసన్నమైంది. మోదీ గారి నాయకత్వంలో BJP గెలుపు కోసం సైనికుడిలా పని చేస్తా’ అని ట్వీట్ చేశారు.

ఇక కేసీఆర్ చేస్తున్న రాజకీయాల పట్ల సొంత పార్టీ నేతలే విసుగుతో ఉన్నారన్నారు. ప్రగతి భవన్ సాక్షిగా జరుగుతున్న కుట్రలు కుతంత్రాలను ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని ఆపివేయాలని ఈటల మంత్రి కేటీఆర్ ను ఉద్దేశించి సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news