జితేందర్ రెడ్డికి ఈటల కౌంటర్‌..ఏదీ పడితే, అది మాట్లాడకంటూ !

-

బీజేపీ నేత జితేందర్ రెడ్డికి హుజురాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కౌంటర్‌..ఏదీ పడితే, అది మాట్లాడకంటూ కౌంటర్‌ ఇచ్చారు. నిన్న బీజేపీ పార్టీపై జితేందర్ రెడ్డి వివాదస్పద ట్వీట్‌ చేసిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ అంశంపై ఈటల రాజేందర్ మాట్లాడుతూ…. జితేందర్ రెడ్డి గారు ఎందుకు ట్వీట్ చేశారో.. ఆయన ఉద్దేశ్యం ఏంటో ఆయననే అడగాలన్నారు.

కానీ… వయసు, అనుభవం ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని చురకలు అంటించారు ఈటల రాజేందర్. ఏదీ పడితే అది మాట్లాడకూడదని హెచ్చరించారు ఈటల. ఎవరి గౌరవంకు భంగం కలగకుండా చూసుకోవాలని… స్వేచ్ఛ, గౌరవం తగ్గించకూడదని హితువు పిలికారు ఈటల రాజేందర్. కాగా, నిన్న తెలంగాణ బీజేపీ నేతలను ఉద్దేశించి.. ఓ దున్నపోతును కొట్టే వీడియోను జితేందర్ రెడ్డి ట్వీట్‌ చేసిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news