హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. బెంగళూరు నుంచి..?

-

హైదరాబాద్‌లో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు అధికారులు. బెంగళూరుకు చెందిన అజయ్ నుంచి 70 గ్రాముల MDMA సీజ్ చేసారు. బెంగళూరు నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి హైదరాబాద్‌లో అముతున్నట్లు గుర్తించారు. అయితే ముందుగా బుక్‌చేసుకున్న కస్టమర్లకు డ్రగ్స్‌ సరఫరా చేస్తున్నాడు నిందితుడు. సోషల్ మీడియా ద్వారా డ్రగ్స్‌ అమ్మకాలు జరుపుతున్నాడు అజయ్.

అయితే ముందుగా బెంగళూరు నుండి బస్సులో డ్రగ్స్‌ను పార్శిల్‌ పంపి.. తర్వాత హైదరాబాద్ కు వచ్చి అమ్మకం చేపడుతున్నాడు. అయితే విషయం తెలుసుకున్న ఎక్సైజ్‌ అధికారులు అజయ్‌ ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు. ఇక ఈ మధ్య హైదరాబాద్‌లో ఎక్సైజ్‌ అధికారుల దాడులు పెరిగిన విషయం తెలిసిందే. ఈ మధ్య కాలంలో ఆంధ్రా నుంచి గంజాయి తెచ్చి అమ్ముతున్న ముగ్గురు మహిళలను అరెస్ట్‌ చేసారు. ధూల్‌పేట్‌కు చెందిన గీతాబాయ్, శీలాబాయ్, క్రాంతిలను అరెస్ట్‌ చేసారు ఎక్సైజ్ అధికారులు. అయితే గత కొంతకాలంగా ఎక్సైజ్‌ అధికారులకు దొరక్కుండా తిరుగుతున్న నిందితులు.. ధూల్‌పేట్‌ను అడ్డాగా చేసుకుని గంజాయ్ అమ్ముతున్నారు. ఏపీ, ఒడిశా నుంచి గంజాయి తెచ్చి సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లకు అమ్ముతున్నారు ఈ మహిళలు.

Read more RELATED
Recommended to you

Exit mobile version