గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

-

జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్లితే… ఆంధ్రప్రదేశ్ లోని ఆళ్లగడ్డకు చెందిన వెంకటేష్ తన కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ లో నివాసం ఉంటున్నాడు. ఆళ్లగడ్డలో ఉన్న తన బావమరిది పెళ్లి ఉండటంతో కుటుంబ సభ్యులతో కలిసి AP 29G 5553 నెంబర్ గల స్కార్పియో వాహనంలో వచ్చాడు.  వివాహ తంతు ముగిసిన తరువాత రిటర్న్ గా శుక్రవారం రాత్రి అదే వాహనంలో హైదరాబాద్ తిరుగుప్రయాణమయ్యారు.

గద్వాల జిల్లా ఎర్రవల్లి మండల కేంద్రానికి ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో వేగంగా వస్తున్న స్కార్పియో వాహనం ముందు వెళ్తున్న లారీని ఢీ కొట్టడంతో పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో వెంకటేష్ (38), అతని భార్య పుష్ప (35), తల్లి లత (55), మేనల్లుడు ఆదిత్య (8) అక్కడికక్కడే మృతి చెందారు. వెంకటేష్ అక్క కవిత, కూతురు తరుణి, కుమారుడు నందుకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషయం తెలిసిన వెంటనే సీఐ రవిబాబు, ఎస్ఐ వెంకటేష్ ఆధ్వర్యంలో హుటాహుటిన పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మెరుగైన వైద్యం కోసం క్షతగాత్రులను కర్నూలుకు తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం గద్వాల జిల్లా ఆసుపత్రికి తరలించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version