మంత్రులను అడ్డుకున్న అటవీ సిబ్బంది.. ఎఫ్​ఆర్​ఓ అంత్యక్రియల్లో స్వల్ప ఉద్రిక్తత

-

గుత్తికోయల దాడిలో మృతి చెందిన ఎఫ్​ఆర్​ఓ శ్రీనివాసరావు అంత్యక్రియలు ఖమ్మం జిల్లా ఈర్లపూడిలో ముగిశాయి. ప్రభుత్వలాంఛనాలతో శ్రీనివాస రావు అంత్యక్రియలు నిర్వహించారు. ఆయన అంతిమయాత్రలో మంత్రులు ఇంద్రకరణ్​రెడ్డి, పువ్వాడ అజయ్​ పాల్గొని పాడె మోశారు. అంత్యక్రియలకు వచ్చిన మంత్రులను మొదట అటవీ సిబ్బంది అడ్డుకున్నారు. గుత్తికోయల దాడుల నుంచి రక్షించాలని కోరారు. ఈ క్రమంలో ఆందోళనకు దిగడంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది.

తమపై గుత్తికోయలు దాడులు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అటవీ అధికారులు, సిబ్బంది మంత్రుల ఎదుట వాపోయారు. ఛత్తీస్​గఢ్​ నుంచి వచ్చిన గుత్తికోయలను రాష్ట్రం నుంచి పంపించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అటవీశాఖ అధికారులకు ఆయుధాలు సమకూర్చాలని మంత్రులకు విన్నవించుకున్నారు. కాసేపు అక్కడ స్వల్ప ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఈ విషయం పట్ల సానుకూలంగా స్పందించిన మంత్రులు వారి సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళతామని హామీ ఇచ్చారు. ఆయుధాల అంశంపై సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news