CMRF గోల్ మాల్ కేసులో నలుగురు అరెస్ట్

-

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను మోసం చేసిన కేసులో మాజీ ఆరోగ్య మంత్రి టి. హరీష్ రావు కార్యాలయంలోని ఉద్యోగి సహా నలుగురిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. హరీష్ రావు కార్యాలయంలో కాంట్రాక్ట్ ఆధారిత డేటా ఎంట్రీ ఆపరేటర్ జోగుల నరేష్ కుమార్, కారు డ్రైవర్ కొర్లపాటి వంశీ, అసెంబ్లీ అటెండర్ బాలగోని వెంకటేష్ గౌడ్, గోదావరిఖని నివాసి ఓంకార్లను బుధవారం సాయంత్రం అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. రూ.5 లక్షల CMRF చెక్కులను వీరు ఎన్క్యాష్ చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే నలుగురిని అరెస్ట్ చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు రిమాండ్కు తరలించారు. అంతేకాకుండా.. వారి వద్ద నుంచి కొన్ని CMRF చెక్కులను సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

CMRF చెక్కులను కాజేశారని నారాయణఖేడ్ కి సంబంధించిన రవినాయక్ ఫిర్యాదుపై జూబ్లీహిల్స్ పీఎస్ లో కేసు నమోదు చేశారు. రవినాయకు వెళ్లాల్సిన CMRF చెక్కును కాజేసిన హరీష్ కార్యాలయ సిబ్బంది వాడుకున్నారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే CMRF చెక్కుల గోల్ మాల్ బయటపడింది. అయితే.. ఈ వ్యవహారంపై హరీష్ రావు స్పందిస్తూ.. CMRF చెక్కుల గోల్ మాల్ ఇష్యూతో నాకు సంబంధం లేదు క్లారిటీ ఇచ్చారు. నరేష్ వ్యవహారం తెలిసిన వెంటనే డిసెంబర్ లో ఫిర్యాదు చేశామని ఆయన పేర్కొన్నారు. నిందితులెవరైనా కఠిన చర్యలు తీసుకోండని హరీష్ రావు తేల్చిచెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news