నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

-

నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మొబైల్‌ విడిభాగాల వ్యాపారం చేస్తున్న ఈ నలుగురు హైదరాబాద్ నుండి నిజామాబాద్ వైపు కారులో వెళ్తుండగా అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో 44వ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతుల్లో ముగ్గురు మహారాష్ట్ర కొండల్వాడికి చెందిన వారు కాగా… మరో వ్యక్తి సాయిరాం నిజామాబాద్ దుబ్బ నివాసి.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఒకే ప్రమాదంలో అన్నదమ్ములు గణేష్ , ఆదిత్య మృత్యువాత పడ్డారు. దీంతో ఆ కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది. మృతదేహాలను నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరోవైపు కరీంనగర్‌ జిల్లా గంగాధర మండలం కురిక్యాల రోడ్డు సమీపంలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఇద్దరు మృతి చెందారు. గోలిరామయ్యపల్లికి చెందిన కొలిపాక మల్లేశం వేములవాడలో దైవ దర్శనం చేసుకుని ద్విచక్రవాహనంపై తిరిగి వెళ్తుండగా.. స్వగ్రామానికి ఇస్లాంపూర్‌కు చెందిన నేరేళ్ల సత్తయ్య తన కుమారై ఇంట్లో శుభకార్యాయానికి హాజరై వెళ్తుండగా కురిక్యాల సమీపంలో రెండు వాహనాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరికి హెల్మెట్‌ లేకపోవడంతో అక్కడిక్కకడే మృతి చెందారు.

Read more RELATED
Recommended to you

Latest news