సీఎం రేవంత్ రెడ్డితో గౌతమ్ అదానీ భేటీ.. భారీ విరాళం

-

అదానీ గ్రూప్ సంస్థల చైర్మన్ గౌతమ్ అదానీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ విషయాన్ని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. అదానీ తనను మర్యాదపూర్వకంగా కలిశారని తెలిపారు. ఈ క్రమంలోనే అదానీ ఫౌండేషన్ నుంచి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి రూ.100 కోట్ల విరాళం చెక్కు రూపంలో అందజేశారని పేర్కొన్నారు.

ఈ సమావేశంలో అదానీ గ్రూప్ ఫౌండేషన్ ప్రతినిధులు, సీఎస్ శాంతి కుమారి, ఇతర అధికారులు ఉన్నారు. కాగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ప్రారంభిస్తున్న విషయం తెలిసిందే. యూనివర్సిటీ బోర్డు చైర్మన్ గా ప్రముఖ
పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రాను నియమించారు. ఈ స్కిల్ యూనివర్సిటీతో ఎంతో మంది పేదలకు మేలు జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి పలు సందర్బాల్లో చెప్పిన విషయం తెలిసిందే. అదానీ రూ.100 కోట్లు ఇవ్వడంతో స్కిల్ యూనివర్సిటీకి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభిస్తుందని పలువురు చర్చించుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version