ఎంసెట్‌, నీట్, జేఈఈ పోటీ పరీక్షలకు హాజరయ్యే అయ్యే వారికి గుడ్ న్యూస్..

-

ఎంసెట్‌, నీట్, జేఈఈ పోటీ పరీక్షలకు హాజరయ్యే ప్రభుత్వ కాలేజీలోని విద్యార్థులకు సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది.ఆ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఉచిత శిక్షణ ఇచ్చేందుకు ఇంటర్ బోర్డు ఏర్పాట్లు చేసింది. శిక్షణను మే చివరి వారం నుంచి ఉచిత శిక్షణ ప్రారంభించాలని అధికారులు నిర్ణయించారు. ఆన్‌లైన్‌తోపాటు ఆఫ్‌లైన్‌లోనూ శిక్షణ ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. ఆన్‌లైన్ క్లౌడ్ ఎడ్జ్ సంస్థ సహకారంతో ఉచిత శిక్షణ ఇస్తారు.దాంతో పాటుగా ఆయా జిల్లాల్లో 32 కు పైగా కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేయాలనీ అధికారులకు చెప్పారు.

మే 20,2022 లేదా మే 21, 2022వ తేదీ నుంచి ఉచిత శిక్షణ ప్రారంభించాలని నిర్ణయించారు. విద్యార్థులు tscie.rankr.io లింక్ ద్వారా ఇంట్లోనే ఉంటూ పరీక్షలకు కోచింగ్ తీసుకోవచ్చు.కాగా, గత ఏడాది సైతం ఇదే తరహా శిక్షణ ఇవ్వగా రాష్ట్రంలో 20వేల మంది విద్యార్థులు సద్వినియోగం చేసుకున్నారు. అందులో 2,685మంది విద్యార్థులు ఉత్తమ ర్యాంక్ సాధించారు. ఇండియాలోని బాగా పాపులర్ అయిన పోటీ పరీక్షల్లో నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ ఒకటి. మెడికల్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఈ ఎగ్జామ్ కు పోటీ విపరీతంగా ఉంటుంది.

అయితే డాక్టర్ కావాలన్న కలతో లక్షలాది మంది విద్యార్థులు ఈ పరీక్షకు ఏళ్ల పాటు ప్రిపేర్ అవుతూ ఉంటారు.పేద కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థులకు మాత్రం కలలు కలలుగానే మిగిలిపోయేవి.ఆన్లైన్లో అందుబాటులో ఉన్న స్టడీ మెటీరియల్, ఇతర పుస్తకాలతో వారు ప్రిపర్ అవుతారు.. అలాంటి వారికి గుడ్ న్యూస్..కేవలం ఒక స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు ఇంట్లోనే ఉండి ఉచితంగా కోచింగ్ పొందే అవకాశం ఉంది. Affinity Education App మీకు ఆ అవకాశాన్ని కల్పిస్తుంది..ఇది తెలంగాణ  విద్యార్థులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి.

Read more RELATED
Recommended to you

Latest news