పండుగ వేళ కేంద్రం గుడ్ న్యూస్.. తెలంగాణకు 3,745, ఏపీకి 7,211 కోట్లు

-

విజయదశమి పండగ వేళ రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. దేశంలోని అన్నీ రాష్ట్రాలకు అక్టోబర్ నెలలో చెల్లించాల్సిన పన్నుల వాటా రూ 1,78,173 కోట్లను విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం. ముఖ్యంగా  రాష్ట్ర ప్రభుత్వాలకు అందించే నెలవారీ పన్నుల వాటా కాకుండా ఈసారీ పండగలు, రాష్ట్రాల అభివృద్ధి, మూలధన వ్యయానికి ఊతమిచ్చేలా అదనంగా ఒక నెల అడ్వాన్స్ చెల్లింపుల కింద మరో రూ. 89,086.50 కోట్లు రిలీజ్ చేసింది.

ఇందులో తెలుగు రాష్ట్రాలు అయిన తెలంగాణకు 3,745 కోట్లు, ఆంధ్రప్రదేశ్ కు 7,211 కోట్లు చెల్లించింది. అత్యధికంగా  ఉత్తర ప్రదేశ్  కి రూ.31,962 కోట్లు దక్కనుండగా బిహార్ కు రూ.17,921 కోట్లు, మధ్యప్రదేశ్ కు 13,987 కోట్లు, పశ్చిమబెంగాల్ కు రూ. 13,404, మహారాష్ట్రకు రూ.11,255, రాజస్థాన్ కు రూ.10,737 కోట్లను విడుదల చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news