తెలంగాణ రైతలన్నకు శుభవార్త..

-

తెలంగాణ రైతలన్నకు శుభవార్త అందింది. నైరుతి రుతుపవనాలు ఈ రోజు కేరళలో ప్రవేశించాయి. రాగల 48 గంటల్లో కేరళ అంతటా తమిళనాడు, కర్ణాటక లోని కొన్ని భాగాలకు ప్రవేశించే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ సూచనలు చేసింది.

నైరుతి రుతు పవనాలు ఈ రోజు కేరళ లో ప్రవేశించిన తరుణంలోనే తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు, రేపు అక్కడక్కడ ఎల్లుండి కొన్నిచోట్ల తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ రోజు, రేపు తెలంగాణ రాష్ట్రం లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులుతో కూడిన వర్షాలు అక్కడక్కడ వచ్చే అవకాశం ఉంది. ఎల్లుండి ఉరుములు, మెరుపులుతో కూడిన వర్షాలు అక్కడక్కడ వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు, రేపు రాష్ట్రంలో వడగాలులు అక్కడక్కడ వీచే అవకాశం ఉంది. ఖమ్మం నల్గొండ, సూర్యపేట, కొత్తగూడెం, ఆదిలాబాద్, కొమరం భీం, మంచిర్యాల్, నిర్మల్ జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శౄఖ పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news