BREAKING : వైఎస్ షర్మిల అరెస్టుపై గవర్నర్ తమిళిసై సీరియస్

-

BREAKING : వైఎస్ షర్మిల అరెస్టుపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సీరియస్ అయ్యారు. నిన్న వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్టు చేసి… ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ కు తరలించిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ సంఘటనపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్పందించారు.

వైఎస్‌ఆర్‌టీపీ చీఫ్, మాజీ సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె శ్రీమతి వైఎస్ షర్మిల అరెస్టుపై గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ ఆందోళన వ్యక్తం చేశారు.

ఆమె కారు లోపల ఉన్నప్పుడు ఆ కారును దూరంగా లాగుతున్న దృశ్యాలు కలవరపెట్టాయంటూ ట్వీట్‌ చేశారు. అయితే… గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ట్వీట్‌ పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాజకీయ నాయకురాలిగా వ్యవహరిస్తున్నారని నిప్పులు చెరుగుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news