నేడు తెలంగాణకు జేపీ నడ్డా..హీరో నితిన్ కీలక సమావేశం

-

నేడు తెలంగాణకు రానున్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. ఇవాళ సాయంత్రం హన్మకొండలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో జరగనున్న సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హజరు కానున్నారు. ఇందులో పాల్గొనేందుకు నడ్డా..ఇవాళ మధ్యాహ్నం 12 గంటల 40 నిమిషాలకు సతీసమేతంగా శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోనున్నారు.

ఎయిర్ పోర్టు సమీపంలోని నోవాటెల్ హోటల్ లో కాసేపు ఆయన విశ్రాంతి తీసుకోనున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ నగరానికి చెందిన పలువురు ప్రముఖులతో నడ్డా భేటీ కానున్నారు. మధ్యాహ్నం 2.40 గంటలకు శంషాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో వరంగల్ కు బయలుదేరుతారు. 3 నుంచి 3.15 గంటల సమయంలో వరంగల్ లోని భద్రకాళి అమ్మవారిని ఆయన దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

4.10 నుంచి 5.40 గంటల వరకు ఆర్ట్స్ కళాశాల మైదానంలో జరిగే పాదయాత్ర ముగింపు సభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొంటారు. సాయంత్రం 5.55 గంటలకు వరంగల్ నుంచి హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం అవుతారు. అయితే.. హైదరాబాద్‌ లో ఇవాళ హీరో నితిన్‌, జేపీ నడ్డాతో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై వారిద్దరూ చర్చించే ఛాన్సు ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news