తెలంగాణలో పరువు హత్య… భూమిని చూపించాలని తీసుకెళ్లి దారుణం

-

తెలంగాణలో మరో పరువు హత్య జరిగింది. గతంలో మిర్యాలగూడలో అమృత-ప్రణయ్ హత్య తరహాలోనే తాజాగా మరోదాడి జరిగింది. భువనగిరి జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. కూతురు తన మాట వినకుండా ఇష్టం లేని పెళ్లి చేసుకుందనే అక్కసుతో సొంత తండ్రే కూతురి భర్తను చంపాలని ప్లాన్ వేశాడు. దీనికి సుపారీ ఇచ్చి అల్లుడిని హతమార్చాడు. 

పూర్తి వివరాల్లోకి వెళితే భువనగిరికి చెందిన భార్గవి, రామక్రిష్ణ ఇద్దరు ప్రేమించుకున్నారు. ఈక్రమంలో పెద్దలను ఎదురించి పెళ్లి చేసుకున్నారు. గతంలో హోంగార్డుగా పనిచేసిన రామక్రిష్ణ ప్రస్తుతం రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నాడు. ఈక్రమంలోనే భార్గవి తండ్రి వెంకటేష్ గతంలో వీఆర్వోగా పనిచేశారు. అయితే తన కూతురును పెళ్లి చేసుకున్నాడనే కోపంతో రామక్రిష్ణను చంపాలని ప్లాన్ వేశాడు. దీని కోసం రౌడీ షీటర్ లతీఫ్ ఖు సుపారీ ఇచ్చాడు. అయితే ప్లాన్ ప్రకారం ముగ్గురు మహిళలతో కలిసి ల్యాండ్ కావాలని రామక్రిష్ణ దగ్గరకి వెళ్లారు. భూమి చూపించడానికి తీసుకెళ్లిన క్రమంలో కిడ్నాప్ చేసి హత్య చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news