టిఆర్ఎస్ ఫ్లెక్సీలపై GHMC కొరడా.. బడా నేతలకు జరిమానాలు..

-

హైదరాబాద్ లోని హైటెక్స్ లో నిన్న టిఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సమావేశం భారీ ఎత్తున జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ కార్యక్రమం నేపథ్యంలో హైదరాబాద్ నగర వ్యాప్తంగా భారీగా ఫ్లెక్సీలు, బ్యానర్లు, కటౌట్ పెట్టారు టిఆర్ఎస్ నాయకులు. దీంతో హైదరాబాద్ అంతా గులాబీ మాయమైపోయింది. టిఆర్ఎస్ పార్టీపై తమ అభిమానాన్ని చాటుకునే ఎందుకు గులాబీ శ్రేణులు ఎక్కడికక్కడ ఏర్పాటు చేశారు.

అయితే ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై జీహెచ్ఎంసీ కొరడా విధించింది. అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై ఫైన్ విధించారు అధికారులు. ఇందులో భాగంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు 50 వేల రూపాయలు, కే కేశవరావు కు 65,000, మైనంపల్లి రోహిత్ కు 40 వేల రూపాయలు, దానం నాగేందర్ కు ఐదు వేల రూపాయలు, తమన్ కాలేరు వెంకటేష్ కు పది వేల రూపాయల చొప్పున జరిమానా విధించారు.

Read more RELATED
Recommended to you

Latest news