హైదరాబాద్ మెట్రో రైలు వేళ‌లు పొడిగింపు

-

భాగ్యనగరవాసులకు హైదరాబాద్ మెట్రో సంస్థ శుభవార్త చెప్పింది. మెట్రో రైలు వేళలు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. రాత్రి 11 గంటల వరకు మెట్రో రైలు వేళలు పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. ఈనెల 10 నుంచి ఈ నిబంధన అమల్లోకి రానున్నట్లు తెలిపింది.

మరోవైపు మెట్రో ప్రకటనతో భాగ్యనగరవాసులు ఖుష్ అవుతున్నారు. ముఖ్యంగా కార్యాలయాలకు వెళ్లేందుకు మెట్రో రైలునే రవాణాగా వినియోగించుకుంటున్న వారు హైదరాబాద్ మెట్రో సంస్థ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉదయం వేళ మెట్రోలో ప్రయాణిస్తున్నాం.. కానీ ఆఫీసులో అదనపు గంటలు పని చేయాల్సి వచ్చినప్పుడు.. వేరే షిఫ్టుల్లో వెళ్లినప్పుడు తిరుగు ప్రయాణం కష్టంగా ఉండేదని.. ఇప్పుడు మెట్రో నిర్ణయంతో తాము హ్యాపీగా త్వరగా ఇంటికి వెళ్లొచ్చని అంటున్నారు మెట్రో ప్రయాణికులు.

Read more RELATED
Recommended to you

Latest news