హైదరాబాద్‌లో రేపు పార్కులు బంద్‌.. ఎందుకంటే?

-

రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రేపు హైదరాబాద్​లో తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. ప్రయాణికులంతా సహకరించాలని కోరారు. మరోవైపు నగరంలోని పార్కులను రేపు మూసివేయనున్నట్లు హెచ్​ఎండీఏ తెలిపింది.

తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లోభాగంగా ఈ నెల 22వ తేదీన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం ఎదురుగా ఉన్న అమరవీరుల స్మారకాన్ని సీఎం కేసీఆర్‌ ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా సెక్రటేరియట్‌ పరిసరాల్లో ఉన్న పార్కులకు హెచ్‌ఎండీఏ గురువారం రోజున సెలవు ప్రకటించింది. సామాన్య ప్రజానీకానికి, పార్కులకు వచ్చే సందర్శకులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు. బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు (బీపీపీ) పరిధిలో ఉన్న లుంబినీ పార్క్, ఎన్టీఆర్ ఘాట్, ఎన్టీఆర్ గార్డెన్‌లను మూసివేయనున్నట్లు చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news