కేసీఆర్ కి చిత్తశుద్ధి ఉంటే పేపర్ లీకులపై CBI విచారణకు ఆదేశించాలి – వైఎస్ షర్మిల

-

టీఎస్పీఎస్సీ పేపర్ లీకుల్లో సిట్ దర్యాప్తు కొండను తవ్వి ఎలుకను పడుతున్నట్లుందని ఎద్దేవా చేశారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ఇప్పటిదాకా 19మందిని అరెస్ట్ చేశామని చెప్తున్న సిట్.. పాత్రధారులను మాత్రమే దోషులుగా చూపెడుతూ సూత్రధారులకు క్లీన్ చీట్ ఇచ్చే పనిలో పడిందని ఆరోపించారు. ప్రగతి భవన్ డైరెక్షన్ లోనే సాగుతున్న దర్యాప్తులో తెరవెనుక ఉన్న అసలు దొంగలను దాచిపెడుతున్నారని అన్నారు. పేపర్ లీకులు దేశాలు దాటిపోయినా పట్టింపు లేదని.. బోర్డ్ సభ్యుల్లో ఒక్కరినీ అదుపులోకి తీసుకోలేదన్నారు.

కనీసం కాన్ఫిడెన్షియల్ అధికారిని కూడా బాధ్యతల నుంచి తప్పించలేదని.. దర్యాప్తు ముగిసే వరకు బోర్డ్ సభ్యులపై కనీసం నిఘా పెట్టలేదని మండిపడ్డారు. పేపర్ లీకుల్లో కేవలం ఉద్యోగులు మాత్రమే ఉంటే సీబీఐ దర్యాప్తుకు కేసీఆర్ అండ్ బ్యాచ్ కి భయమెందుకు? అని నిలదీశారు షర్మిల. సీబీఐ పేరు చెప్తేనే వణుకు పుడుతుందంటే అసలు దొంగలు ప్రగతి భవన్ లోనే ఉన్నట్లా? కేసీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే పేపర్ లీకులపై సీబీఐ విచారణకు ఆదేశించాలన్నారు. టీఎస్పీఎస్సీ ప్రస్తుత బోర్డ్ తక్షణం రద్దు చేసి కొత్త బోర్డ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news