కంట్లో ఎడతెగని కన్నీరు.. హరీశ్ రావు ఎమోషనల్ ట్వీట్..!

-

తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని  ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి పదివేల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా తెలిపారు. ప్రజలు కష్టాల్లో ఉన్నారు. సహాయక చర్యల కోసం ఆర్తిగా ఎదురు చూస్తున్నారని తెలిపారు. ఇంట్లో వరద నీరు, కంట్లో ఎడతెగని కన్నీరు.. వరద సృష్టించిన విలయాన్ని చూస్తుంటే గుండె తరుక్కుపోతుందని  ఎమోషనల్ ట్వీట్ చేశారు హరీశ్ రావు.

కాంగ్రెస్ ప్రభుత్వం కొంతకాలం శుష్క రాజకీయాలు, కూల్చివేతలను ఆపి బాధితులను ఆదుకోవడం పై సంపూర్ణంగా దృష్టి కేంద్రీకరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం బాధ్యతాయుతంగా మనసుపెట్టి చర్యలు తీసుకోవాలని, వరద బాధితులను అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. విద్యుత్ సరఫరాను పునర్దరించాల్సిన చోట వేగంగా చర్యలు తీసుకోవాలని, ఆహారం నీరు అందుబాటులో ఉంచాలని తెలిపారు హరీశ్ రావు.

Read more RELATED
Recommended to you

Latest news