రెండో టెస్ట్ లో భారత్ విజయం.. సిరీస్ డ్రా

-

కేప్‌ టౌన్‌ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. దీంతో రెండు టెస్ట్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. అంతకు ముందు సెంచూరియన్‌ ఆతిథ్యమిచ్చిన తొలి టెస్టులో చిత్తుగా ఓడడంతో ప్రపంచ టెస్ట్‌ ఛాంపియన్‌ షిప్‌ పాయింట్ల పట్టికలో రోహిత్‌ సేన ఏకంగా ఆరో స్థానానికి పడిపోయింది.

అయితే సఫారీలను దెబ్బకు దెబ్బ తీసి కేప్‌ టౌన్‌ వేదికగా జరిగిన రెండో టెస్టులో రోహిత్ సేన ఘన విజయం సాధించింది. దీంతో WTC పాయింట్ల పట్టికలో మళ్లీ అగ్రస్థానానికి దూసుకొచ్చింది భారత జట్టు. కేప్ టౌన్ టెస్టులో విజయంతో భారత్‌ ఖాతాలో మొత్తం 12 పాయింట్లు చేరాయి. దక్షిణాఫ్రికా పర్యటన ముగిసిన తర్వాత 54.16 PCT పాయింట్లతో భారత్ టాప్‌ ప్లేస్‌లో నిలిచింది. దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ 50 శాతం పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో పాకిస్థాన్, వెస్టిండీస్, ఇంగ్లండ్, శ్రీలంక ఉన్నాయి

Read more RELATED
Recommended to you

Exit mobile version