GHMC కార్యాలయం వద్ద బిజెపి కార్పొరేటర్ల వినూత్న నిరసన

-

నేడు జిహెచ్ఎంసి సర్వసభ్య సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష బిజెపి కార్పొరేటర్లు జిహెచ్ఎంసి పరిధిలో వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. జిహెచ్ఎంసి అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల వర్షం కారణంగా ప్రజలకు ఎదురవుతున్న సవాళ్లను నివారించేందుకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం పై వినూత్నంగా నిరసన తెలుపుతున్నారు బిజెపి కార్పొరేటర్లు.

చిన్న వర్షానికి హైదరాబాద్ నగరం అతలాకుతలం అవుతుందని, నగరంలో కుక్కల దాడులు, నాలాలో పడి చిన్నారి మృతి చెందడం.. వంటి సమస్యలను ప్రతిబింబించేలా నిరసనకు దిగారు. బిజెపి కార్పొరేటర్ లో ఒకరు దోమ గెటప్ ధరించగా, మరికొందరు లైఫ్ జాకెట్లు ధరించి నిరసన తెలుపుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news