నేడే తెలంగాణ ఇంటర్‌, టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు

-

తెలంగాణ ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు ఆన్‌లైన్‌లో ఫలితాలు పొందుపరుస్తామని ఇంటర్ బోర్డు ప్రకటించింది. తెలంగాణ ఇంటర్‌ ఫస్టియర్‌, సెకండియర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలను జూన్ 12 నుంచి 20 వ‌ర‌కు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఉదయం ఫస్టియర్‌ విద్యార్థులకు, మధ్యాహ్నం సెకండియర్‌ వారికి పరీక్షలు జ‌రిగాయి. రాష్ట్రవ్యాప్తంగా 933 పరీక్షాకేంద్రాల్లో ఈ ప‌రీక్షల‌ను నిర్వహించారు.

ఇంటర్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..  https://tsbie.cgg.gov.in

మరోవైపు పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాల వెల్లడికి ఇవాళ అధికారులు రంగం సిద్ధం చేశారు. ఫలితాలను ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నారు. ఈ మేరకు తెలంగాణ విద్యాశాఖ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. జూన్ 14 నుంచి 22 వరకు పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 70 వేల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌తోపాటు ఇతర వెబ్‌సైట్‌లలోనూ అందుబాటులో ఉంచనున్నారు.

పదోతరగతి ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..  https://bse.telangana.gov.in/

Read more RELATED
Recommended to you

Exit mobile version