మోడీ, అమిత్ షా పై చెప్పులు విసురుతాం – జగ్గారెడ్డి

-

మీరు రాహుల్ గాంధీ మీద చెప్పులు వేస్తే..మోడీ..అమిత్ షా ల మీద చెప్పులు పడతాయని జగ్గారెడ్డి వార్నింగ్ ఇచ్చారు. త్వరలోనే రాహుల్ గాంధీ తెలంగాణలో జోడో యాత్ర నిర్వహించనున్నారు. అయితే దీనిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడుతూ…మెదక్ జిల్లాలో రాహుల్ గాంధీ భారత్ జొడో యాత్ర కి ఘనంగా స్వాగతం పలుకుతామని..18 వెల్ కం పాయింట్స్ పెడుతున్నామన్నారు.

గాంధీని చంపింది కూడా rss స్వయం సేవక్… గాడ్సే కదా..?అని ప్రశ్నించారు. గాడ్సే ని పొగిడిన బీజేపీ నేతలు… గాంధీ విషయంలో తప్పు అని ఎందుకు చెప్పలేదని నిలదీశారు. గాడ్సే ని సమర్ధించే బీజేపీ ఏం చెప్తుందన్నారు. సావర్కర్ మీద చెప్పింది తప్పేం లేదని వెల్లడించారు. రాహుల్ గాంధీ ఫోటో ని చెప్పులతో కొట్టండి అని కర్ణాటక లో బీజేపీ చెప్పింది..మాకు లేవా చెప్పులు..అని ఫైర్ అయ్యారు. దేవుళ్ళ పేరు.. హిందు అని రాజకీయంగా బతకడం తప్పితే..బీజేపీ కి ఏం తెలుసన్నారు. మా దగ్గర కూడా చెప్పులు ఉన్నాయని.. మేము మీ నేతలను కొడతామని హెచ్చరించారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news