జై కేసీఆర్, జై రేవంత్ రెడ్డి అనాలా..? : ఎంపీ లక్ష్మణ్

-

మోడీని మూడోసారి ప్రధానిని చేసేందుకు సికింద్రాబాద్ లో కిషన్ రెడ్డిని గెలిపించాలని బీజేపీ రాజ్యసభ ఎంపీ డా.కే.లక్ష్మణ్ పేర్కొన్నారు. గతంలో ఎవ్వరికీ ఓటు వేసినా.. ఇప్పుడు మాత్రం మోడీకే ఓటు వేస్తామని ప్రజలు ముక్త కంఠంతో చెబుతున్నారు. దళిత వాడల్లో ప్రజలందరూ మోడీనే కోరుకుంటున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మోసం చేసి గెలుస్తున్నాయని పేర్కొన్నారు.

ఆరు గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ తెలంగాణలో అధికారం చేపట్టి ఐదు నెలలు గడుస్తున్నా.. ఆ హామీల అమలు చేయలేదన్నారు. ఇప్పుడు మళ్లీ ఓట్లు అడుగుతున్నారని పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో కరెంట్ కోతలు, నీటి ఎద్దడి ప్రారంభమయ్యయాని ప్రజలు వాపోతున్నారంటూ ఆరోపించారు ఎంపీ లక్ష్మణ్. కాంగ్రెస్ చేసిన అభివృద్ధి అంశాల గురించి చర్చించకుండా రాజ్యాంగం రద్దని.. రిజర్వేషన్లు రద్దు చేస్తారని భూటకపు ప్రచారాలు చేస్తున్నారని పేర్కొన్నారు. 

Read more RELATED
Recommended to you

Latest news