హైదరాబాద్‌ ఆంధ్రోళ్లే ఎక్కువగా ఉన్నారు – జీవన్ రెడ్డి హాట్ కామెంట్స్

-

హైదరాబాద్ ఐటీ కంపెనీల్లో ఆంధ్రులే అధిక శాతం మంది కొలువుల్లో ఉన్నారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత హైదరాబాద్ కేంద్రంగా తెలంగాణేతరులు, ప్రధానంగా ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారే ఉద్యోగాలు చేస్తున్నారన్నారు.

ఆంధ్రులకు ఉద్యోగాలు ఇచ్చేందుకేనా స్వరాష్ట్రం కోసం పోరాటం చేసిందని ప్రశ్నించారు. ఉద్యోగాలపై మలిదశ ఉద్యమానికి సిద్ధం కావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పార్టీ త్వరలోనే అధికారంలోకి వస్తుందన్నారు. కాంగ్రెస్‌ పార్టీతోనే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news