హైదరాబాద్ కి చేరుకున్న జేపీ నడ్డా

-

బిజెపి చీఫ్ జెపి నడ్డా హైదరాబాద్ చేరుకున్నారు. ఈ సందర్భంగా శంషాబాద్ విమానాశ్రయంలో ఆయనకు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడుబండి సంజయ్, ఇతర ముఖ్య నాయకులు ఘన స్వాగతం పలికారు. ఇక అక్కడినుండి నోవాటెల్ హోటల్ కి చేరుకున్న నడ్డా.. ప్రొఫెసర్ నాగేశ్వరరావు ని కలవనున్నారు. అనంతరం మూడు గంటలకు ఫిలింనగర్ లో పద్మశ్రీ ఆనంద్ శంకర్ ని కలవనున్నారు.

ఆ తరువాత నాలుగు గంటలకి తిరిగి నోవాటెల్ కి చేరుకుంటారు. ఇక సాయంత్రం 4:30 గంటలకు శంషాబాద్ నుండి హెలికాప్టర్ లో నాగర్ కర్నూల్ కి బయలుదేరి.. ఐదు గంటల నుండి 6 మధ్య నాగర్ కర్నూల్ జడ్పీ హైస్కూల్ మైదానంలో బహిరంగ సభలో పాల్గొంటారు. ఇక సాయంత్రం 6:15 గంటలకు హెలిక్యాప్టర్ లో తిరుగు ప్రయాణమై 6:40 కి శంషాబాద్ కి చేరుకుంటారు. ఆ తరువాత రాత్రి 7 గంటలకు ప్రత్యేక విమానంలో కేరళలోని తిరువనంతపురం వెళతారు.

Read more RELATED
Recommended to you

Latest news