దిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో అభిషేక్‌కు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్

-

దిల్లీ లిక్కర్ స్కామ్‌లో అభిషేక్‌ బోయిన్‌పల్లికి సీబీఐ ప్రత్యేక కోర్టు 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించింది. ఇవాళ్టితో అతడి ఈడీ కస్టడీ ముగియడంతో అధికారులు ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. ఈడీ విచారణ కొనసాగుతున్నందున 14 రోజులపాటు జ్యుడీషియల్ రిమాండ్ విధించినట్లు ప్రత్యేక కోర్టు తెలిపింది. విజయ్‌ నాయర్‌ కస్టడీని మరో నాలుగు రోజుల పాటు కొనసాగించాలని ఈడీ అధికారులు కోరారు.

మరోవైపు శరత్‌చంద్రారెడ్డి, బినోయ్‌బాబుకు జైలులో ఇంటి ఆహారం ఇచ్చేందుకు ప్రత్యేక కోర్టు జడ్జి నిరాకరించారు. జైలు నిబంధనల ప్రకారం అనుమతించడం కుదరదన్న స్పష్టం చేశారు. ఏదైనా కావాలనుకుంటే అధికారులకు చెప్పి చేయించుకోవచ్చని తెలిపారు. కొన్ని పుస్తకాలు తెచ్చుకునేందుకు అవకాశం ఇవ్వాలని నిందితుల తరఫు న్యాయవాదులు ప్రత్యేక కోర్టును కోరారు. జైలులో అన్ని పుస్తకాలు దొరుకుతాయన్న జడ్జి చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news