” 28 వేల సార్లు ” నా పేరు చెప్పించినా..నేను దోషిని కాదు – కవిత సంచలనం

-

” 28 వేల సార్లు ” నా పేరు చెప్పించినా..నేను దోషిని కాదంటూ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన ట్వీట్‌ చేశారు. నిన్న టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరు ఢిల్లీ లిక్కర్‌ స్కామ్ ఛార్జ్‌ షీటులో పేర్కొంది ఈడీ. అయితే, విషయాన్ని ట్వీట్‌ చేశారు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి.

అయితే, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చేసిన ట్వీట్‌ కు స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. రాజగోపాల్ అన్న .. తొందరపడకు , మాట జారకు !! అంటూ చురకలు అంటించారు. ” 28 సార్లు ” నా పేరు చెప్పించినా, ” 28 వేల సార్లు ” నా పేరు చెప్పించినా, అబద్ధం నిజం కాదని తేల్చి చెప్పారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.

Read more RELATED
Recommended to you

Latest news