కెసిఆర్ దేవుడి పేరుతో వ్యాపారం చేస్తున్నారు: ఈటెల రాజేందర్

-

ముఖ్యమంత్రి కేసీఆర్ పై తీవ్రంగా మండిపడ్డారు బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్.యాదగిరిగుట్ట ఆలయం పునర్నిర్మాణంలో వందల మంది జీవితాలు ఛిద్రం చేశారని ఈటెల ఆరోపించారు.పార్కింగ్ పేరుతో గంటకు రూ.500 వసూలు చేస్తూ దేవుడి పేరుతో వ్యాపారం చేస్తున్నారని మండిపడ్డారు.గుట్ట పైకి రాకుండా మీడియాను నిషేధించడాన్ని ఈటెల తప్పుబట్టారు.కెసిఆర్ సర్కార్ పోతేనే పరిస్థితి బాగు పడుతుందని అభిప్రాయపడ్డారు.నష్టాల పేరుతో ఆర్టీసీని మూసేసే ప్రయత్నం చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.

మేడే సందర్భంగా ఆయన కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు.ప్రపంచవ్యాప్తంగాా ఇప్పటికీ అనేక రంగాల్లో 8 గంటలకు బదులుగా 12 గంటల పనివిధానం కొనసాగుతోందని అన్నారు.ప్రైవేట్ సెక్టార్ లో శ్రమదోపిడి కారణంగా కొందరి జీవితాలు దుర్భరంగా మారాయని ఈటెల అన్నారు.దేశంలో పంటలు వేయద్దని శాసించిన సీఎం కెసిఆర్ తప్ప ఎవరూ లేరని ఈటెల విమర్శించారు.లక్షల కోట్లు ఖర్చుపెట్టి నీళ్లు అందిస్తున్నామన్న ముఖ్యమంత్రి ఇప్పుడు పంట కొనడానికి రాద్ధాంతం చేస్తున్నాడని ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news