కంటి వెలుగులో తొలి కంటి ఆపరేషన్ కేసీఆర్ కు చేయించాలి – NVSS ప్రభాకర్

-

నగరం లోపల, వెలుపల పెద్ద ఎత్తున అక్రమ భవన నిర్మాణాలు సాగుతున్నాయన్నారు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్విఎస్ఎస్ ప్రభాకర్. బిల్డింగ్ రెగ్యులరేషన్ స్కీంపై హైకోర్టు మొట్టికాయలు వేసిన పురపాలక శాఖ మంత్రికి పట్టదని మండిపడ్డారు. పురపాలక శాఖ మొత్తం అవినీతి మయమైందని ఆరోపించారు. అక్రమ నిర్మాణాలు జరుగుతున్న కేటీఆర్ ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు.

కేటీఆర్ ఒక అసమర్థ మంత్రి అని విమర్శించారు. ప్రతి కంపెనీ పెట్టుబడిలో కేటీఆర్ కి వాటా ఉందన్నారు. పారిశ్రామిక వాడల మీద కేటీఆర్ కన్ను వేశారని …ఆస్తులను కాజేస్తున్నారని ఆరోపించారు. BRS అప్లికేషన్ మీద సంతకం, ఢిల్లీలో భవన శంకుస్థాపన, ఖమ్మం సభకు కేటీఆర్ రాలేదని.. హరీష్ రావును ఢిల్లీకి వెళ్లగోట్టి.. రాష్ట్రాన్ని హస్తగతం చేసుకోవాలని కేటీఆర్ చూస్తున్నారని ఆరోపించారు.

కేసీఆర్ మంత్రి వర్గంలో అతిపెద్ద అవినీతి మంత్రి కేటీఆర్ ఏ అన్నారు. కామారెడ్డి, జగిత్యాల మాస్టర్ ప్లాన్ కూడా కేటీఆర్ దుర్భుద్దేనన్నారు. కంటి వెలుగులో తొలి కంటి ఆపరేషన్ కేసీఆర్ కు చేయించాలన్నారు. కేసీఆర్ కు కళ్లకి అద్దాలు పెట్టించి.. మోడీ అభివృద్ధినీ చూపించాలన్నారు. దేశంలోనే ఏకైక దళిత వ్యతిరేక ముఖ్యమంత్రి కేసీఆర్ అని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news