పొంగులేటిపై మంత్రి పువ్వాడ కీలక వ్యాఖ్యలు

-

ఖమ్మం: మన పక్క రాష్టంలో పోలవరం ఇంత వరకు కట్టలేదని.. కానీ మనం కాళేశ్వరం పూర్తి చేసుకున్నామని అన్నారు మంత్రి పువ్వాడ అజయ్. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీతారామ కట్టడానికి కాంగ్రెస్ కేసులు పెట్టి అడ్డుపడుతుందని ఆరోపించారు. కొంత మందికి కడుపు నొప్పి ఉందని.. అందుకే అడ్డుకుంటున్నారని అన్నారు. ఇక పొంగులేటి శ్రీనివాస్ నీ ఉద్దేశించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారం ఉన్నంత కాలం డబ్బులు, అధికారం అనుభవించి.. ఇప్పుడు కెసిఆర్ ని తిడుతున్నాడని మండిపడ్డారు.

మాట్లాడితే పదికి పది అంటున్నాడని.. మీరు ఆయన జేబులో ఉన్నారా..? అని ప్రశ్నించారు. మేము అరాచకం చేస్తే మీరు రోడ్ల మీద తిరగగలరా..? అని ప్రశ్నించారు. ఇక ఓటుకు నోటు కేసులో ఉన్నోడు ఇక్కడ పీసీసీ అధ్యక్షుడని.. అయన ఏం చేస్తాడని అన్నారు. ఈసారి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ కి డిపాజిట్లు కూడా రావన్నారు. తనకి వడ దెబ్బ తగిలిందని.. అయినా పదికి పది గెలిపించుకోడానికి జిల్లా మొత్తం తిరుగుతున్నానన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news