ఎమ్మెల్యే మల్లాది విష్ణు సవాల్… అప్పులపై బహిరంగ చర్చకు సిద్ధం !

-

మొన్ననే చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రాజమండ్రి వేదికగా మహానాడు కార్యక్రమం జరిగింది. ఇందులో వచ్చే ఎన్నికల మ్యానిఫెస్టోను చూచాయగా చంద్రబాబు ప్రకటించారు. ఇందులో ప్రకటించిన అంశాల గురించి వైసీపీ ఎమ్మెల్యేలు దారుణంగా విమర్శిస్తూ ఎన్నికలు రాకుండానే ఓడిపోయేలా చేస్తున్నారు. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు చంద్రబాబుకు బహిరంగ సవాలు విసిరారు. ఈయన మాట్లాడుతూ రాష్ట్రంలోని పేదలను ధనవంతులను చేస్తానని చంద్రబాబు అబద్దాలు చెబుతున్నాడని.. అంతే కాకుండా రాష్ట్రంలో సంపదను సృష్టిస్తామని గొప్పలు చెప్పుకుంటున్నాడని విమర్శించారు.

ఏపీలో సంపదను సృష్టించే మరగలేమిటో చెప్పాలన్నారు, రాష్ట్రానికి అప్పులు ఎన్ని ఉన్నాయో ఆయనకు తెలుసా అంటూ ప్రశ్నించారు. అప్పులపై బహిరంగ చర్చకు నేను సిద్ధంగా ఉన్నానని సవాలు విసిరారు. మీరు చర్చకు సిద్ధంగా అంటూ ప్రశ్నించారు ? దీనిపై టీడీపీ నుండి ఎవరైనా స్పందిస్తారా చూడాలి

Read more RELATED
Recommended to you

Latest news