మంత్రి కేటీఆర్ పై వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు

-

మంత్రి కేటీఆర్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. సోషల్ మీడియా వేదికగా మంత్రి కేటీఆర్ పై ప్రశ్నల వర్షం కురిపించారు. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని మీ కుటుంబం అప్పుల పాలు చేసి చంపేసింది నిజం కాదా? అంటూ ప్రశ్నించారు.

“పిట్లంలో పిట్టకథలు చెప్పిన పిట్టల దొర కొడుకా కేటీఆర్.. తెలంగాణను రోకలి బండతో కొట్టి చంపింది ఎవరు? 33 ప్రాజెక్టులు కట్టి తెలంగాణ బీడు భూములకు నీళ్ళు పారించినందుకు YSR తెలంగాణను రోకలి బండతో కొట్టి చంపినట్టా? రుణమాఫీ,ఉచిత కరెంట్,సబ్సిడీ పథకాలు ఇచ్చి వ్యవసాయాన్ని పండుగ చేసినందుకు కొట్టి చంపినట్టా? ఆరోగ్యశ్రీ, పక్కా ఇళ్లు, ఫీజు రీయింబర్స్ మెంట్, లక్షల కొద్దీ సర్కార్ ఉద్యోగాల భర్తీ ఇవన్నీ ప్రజలను కొట్టి చంపినట్లేనా? నిజానికి తెలంగాణను రోకలి బండతో కొట్టి చంపుతున్నది నీ అయ్య “కసాయి రావే”. మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని నీ కుటుంబం కోసం నాలుగున్నర లక్షల కోట్లు అప్పు చేసి చంపేసిన మాట నిజం కాదా?

ఇంటికో ఉద్యోగం అని చెప్పి నిరుద్యోగులను, రుణమాఫీ అని రైతులను చంపుతున్నది నిజం కాదా? ఫీజులు చెల్లించక విద్యార్థులను, పోడుపట్టాలు ఇస్తామని గిరిజన బిడ్డలను కొట్టి చంపుతున్నది నీ అయ్య కసాయిరావే కదా? ప్రతిపక్షాలు గుడ్డి గుర్రాలకు పళ్లు తోముతుంటే.. తెలంగాణను దర్జాగా దోచుకుంటున్న దొంగలు మీరు. ప్రాజెక్టుల పేరుతో లక్ష కోట్లు కాజేసింది మీరు.మీ అక్రమాలకు అడ్డొస్తే, ప్రశ్నిస్తే చావగొట్టేది మీరు. తల్లిలాంటి తెలంగాణను చంపుతున్న అసలు కసాయి గూండాలు మీరే. ఈసారి ఓటు కోసం కాలు బయట పెట్టి చూడు. నీకు, నీ అయ్యకు ఆ రోకలి బండే సమాధానం” అని అన్నారు షర్మిల.

Read more RELATED
Recommended to you

Latest news