సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం.. ప్రధాన సలహాదారుగా సోమేశ్ కుమార్

-

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. సీఎం ప్రధాన సలహాదారుగా రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ని నియమించారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా మాజీ సిఎస్ రాజీవ్ శర్మ వ్యవహరిస్తున్నారు. ఈయన కూడా రాష్ట్ర ప్రభుత్వానికి తొలి ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. రిటైర్ అయిన తర్వాత ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా నియమితులైనారు.

ఇక సోమేశ్ కుమార్ ఈ పదవిలో మూడేళ్ల పాటు కొనసాగనున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కు సోమేష్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. అయితే తెలంగాణ సిఎస్ గా ఉన్న సోమేశ్ కుమార్ ను కేంద్రం రిలీవ్ చేసిన విషయం తెలిసిందే. అనంతరం ఆయన ఏపీలో రిపోర్ట్ చేశారు. ఇక ఇటీవల సోమేష్ కుమార్ విఆర్ఎస్ తీసుకోవడంతో కెసిఆర్ ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించారు.

Read more RELATED
Recommended to you

Latest news