BREAKING : మునుగోడు ఉపఎన్నిక బీజేపీ అభ్యర్థిగా కోమటిరెడ్డి

-

BREAKING : మునుగోడు ఉప ఎన్నికకు కాసేపటి క్రితమే షెడ్యూల్‌ విడుదల.. అయింది. ఈ షెడ్యూల్‌ ప్రకారం… ఈ నెల 7న ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ విడుదల కానుంది. 14 వరకు నామినేషన్ల స్వీకరణ ఉండనుంది. అలాగే.. 17 వరకు ఉపసంహరణ కార్యక్రమం ఉండనుంది. ఇక నవంబర్‌ 3 న మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్‌ జరుగనుండగా.. 6న ఫలితాలు వెలువడనున్నాయి.

ఈ నేపథ్యంలోనే బీజేపీ పార్టీ తమ అభ్యర్థిని ఫైనల్‌ చేసింది. మునుగోడు ఉపఎన్నిక బీజేపీ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డిని ఫైనల్‌ చేసింది బీజేపీ పార్టీ అధిష్టానం. కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డినే ముందుకు తీసుకెళ్లాలని భావించి.. ఈ నిర్ణయం తీసుకుంది. కాగా.. ఈ మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పాల్వయి స్రవంతి ఫైనల్‌ కాగా.. అటు టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు. కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డిని బరిలో దించేందుకు టీఆర్‌ఎస్‌ ప్లాన్‌ వేస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news