టీడీపీలోకి కూకట్ పల్లి ఎమ్మెల్యే.. షాక్ లో కేసీఆర్ ?

-

తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు రాష్ట్రంలో తెలుగు దేశం పార్టీకి ఎంతటి క్రేజ్ ఉండేదో ప్రతీ ఒక్కరికీ తెలిసిందే. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న పలువురు కీలక నేతలు టీడీపీకి చెందిన వారే ఉండటం గమనార్హం. సీఎం రేవంత్ రెడ్డి కూడా తెలుగు దేశం పార్టీ నుంచే కాంగ్రెస్ పార్టీలో చేరి సీఎం అయ్యారు. తెలంగాణలో టీడీపీని బలోపేతం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పావులు కదుపుతున్నారు.

నిన్న ఎన్టీఆర్ భవన్ లో  పలువురు కీలక నేతలతో భేటీ అయ్యారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు  మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారి దర్శనాలకు తెలంగాణ ఎమ్మెల్యేల సిఫారసు లేఖలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. ఇందుకు సీఎం చంద్రబాబు నాయుడు కూడా సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. మరోవైపు టీడీపీలోకి కూకట్ పల్లి ఎమ్మెల్యే వెళ్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు  టీడీపీలోకి వెళ్లితే కేసీఆర్ కి షాక్ అయితే తప్పదు అని పలువురు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news