BRS కార్యక్రమానికి వివిధ రాష్ట్రాల నేతలు !

-

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రమే లక్ష్యంగా రెండు దశాబ్దాల క్రితం ఏర్పాటైన తెలంగాణ రాష్ట్ర్ట్ర సమితి (TRS) ప్రస్థానంలో కీలక ముందడుగు పడనుంది. 8 ఏళ్లుగా అధికారంలో కొనసాగుతున్న టిఆర్ఎస్ ఇప్పుడు జాతీయ రాజకీయాలలో ఎంట్రీ కి సిద్ధమైంది. కొత్త జాతీయ పార్టీ.. జాతికి అనివార్యం అనే నినాదంతో టిఆర్ఎస్ ను భారత రాష్ట్ర సమితి (BRS) గా మారుస్తూ కొత్త పార్టీ ఎజెండాను పార్టీ అధినేత సీఎం కేసీఆర్ నేడు మధ్యాహ్నం 1.19 గంటలకు ప్రకటించనున్నారు.

ఈ కార్యక్రమంలో పలు రాష్ట్రాలకు చెందిన వివిధ పార్టీల నేతలు పాల్గొననున్నారు. కెసిఆర్ ఆహ్వానం మేరకు కర్ణాటక నుంచి జెడిఎస్ నేత, మాజీ సీఎం కుమారస్వామి, ఆ పార్టీ ఎమ్మెల్యేలు హైదరాబాద్ చేరుకున్నారు. తమిళనాడు నుంచి విదుతలై చిరుతైగల్ కచ్చి (VSK) వ్యవస్థాపక అధ్యక్షుడు, చిదంబరం ఎంపీ తిరుమావళవన్, ద్రావిడ దేశం వ్యవస్థాపక అధ్యక్షుడు కృష్ణారావు, కొందరు జాతీయ రైతు సంఘం ప్రతినిధులు నగరానికి విచ్చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news