హైదరాబాద్ లో చిరుత కలకలం !

-

తెలంగాణలో చిరుతలు కలకలం రేపుతున్నాయి. ప్రతి రోజూ రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట ఇవి టెన్షన్ పెడుతూనే ఉన్నాయి. తాజాగా రాజేంద్రనగర్ లో మరోసారి చిరుత హల్ చల్ చేసింది. అక్కడ ఆవు పై చిరుత దాడి చేసినట్టు చెబుతున్నారు. అయితే అదే సమయంలో కుక్కలు మొరగడంతో ఆవును వదలి చిరుత పారి పోయింది. ఈ తెలవారు జామున 3.30 నిమిషాలను చిరుత వచ్చినట్లు చెబుతున్న ఫాతీమా ఫామ్ హౌజ్ నిర్వాహకుడు చెబుతున్నారు.

chirutha
chirutha

.నిజానికి గతంలో ఇదే ప్రాంతంలో మూడు లేగ దూడలను చిరుత చంపింది. మళ్ళీ అక్కడే చిరుత పంజా విసరడంతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇక ఇక్కడే కాక జిల్లాలోని అనేక ప్రాంతాల్లో చిరుతలు కనిపిస్తుండటంతో ప్రజలు ఆందోళనలు చెందుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా టెన్షన్ పెడుతున్న చిరుతలను పట్టుకోవడానికి అటవీశాఖాధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. 

Read more RELATED
Recommended to you

Latest news