పార్టీలో పని చేయని వారికి టికెట్లు ఇవ్వం – మధు యాష్కి వార్నింగ్

-

పార్టీలో పని చేయని వారికి టికెట్లు ఇవ్వమని వార్నింగ్‌ ఇచ్చారు మధు యాష్కి. పీజేఆర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలవని వారుండరని.. విష్ణు తండ్రి జ్ఞాపకార్ధం కాంగ్రెస్ నేతలను పిలిచారని వెల్లడించారు. పీజేఆర్ తెలంగాణ రాష్ట్రం కొరకు చేసిన పోరాటమని… పోతిరెడ్డిపాడు కోసం పోరాడారు..,హైదరాబాద్ లో ఉన్న నిరుపేదలకు ఇల్ల స్థలాలు ఇచ్చారని వెల్లడించారు.

పీజేఆర్ కుమారుడు తండ్రికి తగ్గ తనయుడిగా ఉన్నారు..విష్ణు ని చూసి కాంగ్రెస్ యువత ముందుకు రావాలని కోరారు. రాహుల్ గాంధీ నాయక్వత్వం లో మనం అందరం పని చేయాలి..కాంగ్రెస్ లోకి రావడానికి చాలా మంది ఉత్సాహం చూపిస్తున్నారన్నారు.

కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం విధి విధానాలు చూసి వచ్చే వారికి ఆహ్వనం పలుకుతున్నామని.. పార్టీ ని నమ్మి పని చేసిన వారికి అన్యాయం జరగదని చెప్పారు. టికెట్ కోసమే వచ్చి పని చేసే వారికి టికెట్ లు ఉండవు.. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటుంది…కొత్తగా వచ్చిన వారి గురించి అదిష్టానం చూసుకుంటుందన్నారు. ఇక్కడి నుండి వెళ్లిన వారు తిరిగి రావాలని అనుకుంటున్నారు…ప్రశ్నిస్తున్న వారిపై కాల్పులు జరుపుతున్నారు..8 సంవత్సరాలు గా పార్లమెంట్ లో ప్రధానిని ఏనాడు ప్రశ్నించని వ్యక్తి కేసీఆర్ అని ఫైర్‌ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news