బక్కోడివి…ఇంతగా ఎలా బలిశావో తేలాలి కేసీఆర్ !

-

యోగి యూపీ ని రాముడి పేరుతో రావణ కాష్టంగా మార్చారని కాంగ్రెస్ మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్ పేర్కొన్నారు. రాముడు ప్రతీ హిందువుకి ఆదర్శ పురుషుడన్న ఆయన యోగి..రాముని పేరు ముందు పెట్టి నాథూరం గాడ్సే ని పూజిస్తున్నారని అన్నారు. మా అభ్యంతరం రాముణ్ణి పూజించినందుకు కాదు… గాడ్సే ని పూజించే విషయంలోనే అని అన్నారు. బక్క కేసీఆర్.. ఇవాళ బకాసురుడు అయ్యాడు అని అయన ప్రశ్నించారు.

CM KCR
CM KCR

ఆరేళ్ళ పాటు బీజేపీతో కేసీఆర్ దోస్తీ చేశాడని ఇప్పుడు బీజేపీ గోతిలో పడుతున్నాడని ఆయన అన్నారు. పొట్టోడి తల పొడుగొడు కొడితే… పొడుగొడు తల పోచమ్మ కొట్టిందన్నట్టు కాంగ్రెస్ ని కొట్టాలని చూసిన కేసీఆర్ ని ఇప్పుడు బీజేపీ కొడుతుందని ఆయన అన్నారు.  బక్కోడివి…ఇంతగా ఎలా బలిశావో తేలాలి అని ఆయన అన్నారు. కల్వకుంట్ల వారికి కల్లబొల్లి మాటలు చెప్పడంలో దిట్ట అని మధు యాష్కీ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news