2024 లో కేసీఆరే దేశ ప్రధాని – మంత్రి మల్లారెడ్డి

-

2024 లో కేసీఆరే దేశ ప్రధాని అవుతారని తెలంగాణ మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ కు భయపడే, ఇలా ఐటీ రైడ్స్‌ చేయిస్తున్నారని బీజేపీ పై ఫైర్‌ అయ్యారు. నాకు కేసీఆర్ అండగా ఉన్నారు..ఎవరూ ఏం పీకలేరని తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఐటీ రైడ్స్‌ పై ఇవాళ మల్లారెడ్డి ప్రెస్‌ మీట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఐటీ రైడ్స్‌ విషయం సీఎం కేసీఆర్‌ ముందే చెప్పారు.. బీజేపీ కుట్రలకు భయపడేదిలేదని పేర్కొన్నారు.
BRS పార్టీ కేసీఆర్‌ పెట్టారనే భయంతో.. కేంద్రం ఇలా వ్యవహరిస్తోందని ఆగ్రహించారు. బీజేపీకి ఇక్కడ ఎవరూ భయపడబోరని స్పష్టం చేశారు మల్లారెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news