ప్రమాదంలో మరణించిన మహిళా కుటుంబానికి మంత్రి దామోదర సాయం

-

తెలంగాణ వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ మంచి మనస్సు తో తన ఔదార్యాన్ని చాటుకున్నారు. ప్రమాదవశాత్తు మృతి చెందిన మహిళా కుటుంబానికి తక్షణ ఆర్థిక సాయం ప్రకటించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల ఆందోల్ నియోజకవర్గంలోని టేక్మాల్ మండల కేంద్రంలో ఇంటి మిద్దె కూలి మంగలి శంకరమ్మ (62) అనే మహిళ అకాల మరణం చెందారు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న మంత్రి దామోదర తన దాతృత్వాన్ని ప్రదర్శించారు. ప్రమాదం పై స్పందిస్తూ.. వారి కుటుంబానికి తక్షణ సాయం అందించారు. మంగలి శంకరమ్మ కుటుంబానికి అండగా రూ.2 లక్షల రూపాయలను ఆర్థిక సాయం ప్రకటించారు. బాధితురాలి అంత్యక్రియలకు అవసరమైన 11 వేల రూపాయలను తక్షణసాయంగా అందజేశారు. వారి కుటుంబాన్ని ప్రభుత్వపరంగా అన్ని విధాలుగా ఆదుకుంటామని దామోదర రాజనర్సింహ భరోసా కల్పించారు.

Read more RELATED
Recommended to you

Latest news