రంగనాయక సాగర్ ఎడమ కాలువద్వారా సాగునీటిని విడుదల చేసిన మంత్రి హరీష్ రావు

-

రంగనాయక సాగర్ ఎడమ కాలువ ద్వారా సాగునీరు విడుదల చేశారు మంత్రి హరీష్ రావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతు సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలిపారు. ఈ ఎడమ కాలువ ద్వారా మొదటి విడత 100 క్యూసెక్కులు, రెండవ విడత 300 క్యూసెక్కులు.. నారాయణరావుపేట – చిన్నకోడూర్ మండలాల్లోని పలు గ్రామాలు కలుపుకుని మొత్తం 512 క్యూసెక్కుల నీటిని నారాయణరావుపేట మండలం చెరువు, కుంటలు, వాగులు, వంకల్లోకి జలాలు విడుదల చేశామన్నారు.

ఈ చెరువుల్లోకి నీరు చేరడంతో నారాయణరావుపేట మండల పరిధిలోని 4 గ్రామాల రైతులకు ఏంతో మేలు చేకూరనున్నదని తెలిపారు. నారాయణరావుపేట మండలం పరిధిలో 41 వాటర్ బాడీస్ లలోని చెరువులు, చెక్ డ్యాములు, కుంటలు, వాగులు, వంకల ద్వారా 2840 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుందని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news