నల్గొండ కాంగ్రెస్ నేతలు వృద్ధ జంబూకాలు – మంత్రి జగదీష్ రెడ్డి

-

నల్గొండ కాంగ్రెస్ నేతలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు బీఆర్ఎస్ మంత్రి జగదీశ్ రెడ్డి. నల్గొండ కాంగ్రెస్ నాయకులు వృద్ధ జంబుకాలు అని ఎద్దేవా చేశారు. మిర్యాలగూడెంలో బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం లో పాల్గొన్న మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రి పదవులు, బి ఫారాల కోసం నాటి నాయకులు అధిష్టానం వద్ద నోరు మెదపలేదని ఆరోపించారు. వీరి పాలనలో వరుసగా 16 ఏళ్లు పంట పొలాలు ఎండబెట్టారని విమర్శించారు.

ఎత్తు, పొడుగు, లావు ఉన్న వారి పాలనలో కాంగ్రెస్ ఏనాడు కూడా ఆరు స్థానాలకు మించి గెలవలేదని.. కెసిఆర్ హయాంలోనే అన్ని స్థానాలు బిఆర్ఎస్ గెలిచి చరిత్ర సృష్టించింది అన్నారు. కాంగ్రెస్ హయాంలోనే జిల్లాలో ఫ్లోరోసిస్, కరువు పెరిగిందని ఆరోపించారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని కాంగ్రెస్ నాయకులు ఏనాడు ప్రశ్నించలేదని దుయ్యబట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news